
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ పరిసరాల్లో నిర్భయ ఘటనను తలపించే దారుణం వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్కు చెందిన 16 ఏళ్ల బాలికపై కదులుతున్న బస్సులో బ స్సు డ్రైవర్, కండక్టర్ కలిసి సా మూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 4న జరిగిన ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు ఫి ర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని బస్సు డ్రైవర్ కుల్దీప్, కండక్టర్ సందీప్లను అరె స్టు చేసి రిమాండుకు తరలించారు.పోలీసుల కథనం ప్రకారం, మైన్పురి జిల్లాకు చెందిన బాలిక కుటుంబ సభ్యులతో గొడవపడి నొయిడా సెక్టార్-63లో నివసించే తన బంధువు వద్దకు వెళ్లేందుకు రాత్రి 9 గంటల ప్రాంతంలో బస్సు ఎక్కింది. ఆ సమయంలో వర్షం కురుస్తుండంతో పొరపాటున పరిచౌక్ వద్ద దిగిపోయింది. ఆ సమయంలో బస్సు నొయిడా సెక్టార్-63 వద్దకు వెళ్తుందని కండక్టర్
చెప్పడంతో అతని మాటలు నమ్మి బాలిక బస్సు ఎక్కింది. ఆ సమయంలో ఆ బస్సు సాధారణ ప్రయాణికుల సర్వీసులో లేదు. సూరజ్పూర్లోని వర్క్షాపుకు వెళ్తోంది. పరిచౌక్ నుంచి ఢిల్లీలోని కశ్మీర్ గేట్ వరకూ సుమారు 47 కిలోమీటర్ల ప్ర యాణంలో డ్రైవర్, కండక్టర్ బాలికపై అ త్యాచారానికి పాల్పడ్డారు. ప్రతిఘటిస్తే చంపేస్తామని ఇద్ద రూ బాలికలను బెదిరించారు. బస్సు కిటీకీలకు తె రలు ఉండటంతో బయటకు వారికి ఈ విషయం కనిపించలేదు. ఘటన అనంతరం బాలికను కశ్మీ ర్ గేట్ బస్టాండ్ వద్ద దింపి నిందితులు అక్కడి నుంచి వెళ్లివేయారు. అక్కడి నుంచి ఆమె ఆటోరిక్షాలో పోలీస్ స్టేషన్కు వెళ్లగలిగింది. ఘటన జరిగిన రాత్రే పోలీసులు బాలిక కుటుంబానికి సమాచారం ఇచ్చి వారిని ఢిల్లీకి పిలిపించినట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కుటుంబసభ్యులు వ చ్చే వరకూ మహిళా పోలీసులు బాలికతోనే ఉండి అవసరమైన సహాయం అందించినట్టు చెప్పారు.
నిందితుల అరెస్టు
కాగా, ఆగస్టు 4నే ఉత్తర ఢిల్లీలోని తిమార్పూర్లో ఓ పా ర్కింగ్ స్థలం వద్ద నిందితులిద్దరినీ పోలీసులు అరెస్టు చేశా రు. వీరిని కాన్పూర్కు చెందిన బస్సు డ్రైవర్ కుల్దీప్ (39), కండెక్టర్ సందీప్ (26) గా గుర్తించారు. ఘటన జ రిగిన మార్గంలోని వివిధ ప్రాంతాల నుంచి సీసీటీవీ ఫుటేజ్లను పో లీసులు సేకరించి, బస్సు కదలికలను వెనక్కి అనుసరిస్తూ ఘటనల క్రమాన్ని పునరుద్ధరిస్తున్నారు. ఫోరెన్సిక్ పరీక్షల్లో బ స్సులో బాలికకు చెందిన జుట్టు వెం ట్రుకలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బస్సు ను సీజ్ చేశారు. నిందితులిద్ద రూ రెండేళ్లకు పైగా విశ్వనాథ్ ట్రావెల్స్లో పనిచేస్తున్నారని ఆ సంస్థ తెలిపింది. ఇద్దరు నిందితులకు నేర చరిత్ర ఉందా అనే అంశాన్ని, ఈ ఘటనలో మరెవరైనా పాల్గొన్నారా అనే అంశాన్ని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులపై పోలీసులు పొట న్సీ పరీక్ష కూడా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కేసును లోతుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
2012 నాటి ఘటనను తలపించేలా..
ఢిల్లీ నగరంలో 2012లో జరిగిన నిర్భయ సా మూహిక అత్యాచార ఘటనతో తాజా ఘటనను పోలుస్తున్నారు. కదులుతున్న బస్సులో ఒక మహిళపై అత్యంత దారుణంగా లైంగిక దాడి జరిగిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. అనంతరం మహిళలపై నేరాలు, ప్రజా రవా ణా భద్రతకు సంబంధించి చట్టాలు, భద్రతా చర్య ల్లో గణనీయమైన మార్పులుచోటుచేసుకున్నాయి.











