
న్యూఢిల్లీ: మందుపాతరలు అమర్చిన క్షేత్రాలను ధ్వంసం చేసే అత్యంత సామర్థం కలిగిన కీలకమైన ఆర్మీ ట్యాంకుల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వశాఖ రూ. 975 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బిఇఎంఎల్) , ఎలెక్ట్రోన్యూమాటిక్స్ , హైడ్రాలిక్స్ (ఇండియా) ప్రైవేట్ సంస్థలతో ఈ ఒప్పందం కుదిరిందని ప్రకటన వెలువడింది. ఈమేరకు టి 72,/టి90 ట్యాంకులు లభిస్తాయి.













