
హైదరాబాద్: కాళేశ్వరంపై హైకోర్టులో వాదనలు వినిపించడంలో ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల లోపాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును హై కోర్టు నిలిపివేసింది. ఆ రిపోర్టు ఆధారంగా మాజీ సిఎం కెసిఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులపై చర్యలు తీసుకోవద్దని హై కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై సంజయ్ మాట్లాడుతూ.. కెసిఆర్ను కాపాడేందుకు రేవంత్ రెడ్డి శతవిధాలా ప్రయత్నిస్తున్నారని అన్నారు. కెసిఆర్, రేవంత్ కాంప్రమైజ్ పాలిటిక్స్కు కాళేశ్వరం నిదర్శనమి పేర్కొన్నారు. ‘‘కాంగ్రెస్ పెద్దలకు మూటలు వెళ్తున్నాయి.. ఇక్కడ కేసులు మూసేస్తున్నారు. కెసిఆర్, రేవంత్ క్విడ్ ప్రోకోను ప్రజలు గమనిస్తున్నారు’’ అని సంజయ్ అన్నారు.













