
హైదరాబాద్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలతో ఆర్ టిసి జెఎసి నేతలు జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆర్ టిసి కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ రోజు నుంచి తెలంగాణ వ్యాప్తంగా బంద్ కు పిలుపునివ్వడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఐఎఎస్ అధికారుల కమిటీతో జెఎసి నేతలు సుదీర్థంగా చర్చలు జరిపినప్పటికి ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో కార్మికులు డిపోల ముందు ధర్నాకు దిగారు. ఈ రోజు నుంచి ఆర్ టిసి కార్మికులు సమ్మెకు పిలుపు నివ్వడంతో ఆర్ టిసి ఎండి నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆర్ టిసి కార్మికుల సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు తాము సిద్దంగా ఉన్నామని, కార్మికులు డిమాండ్లను పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని వివరించారు. రాజకీయ లబ్ది కోసమే కార్మికులను నేతలు తప్పుదోవపట్టిస్తున్నారని దుయ్యబట్టారు. కార్మికులు సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని కోరారు. ఇప్పటికే కార్మికులు డిపోలకు చేరుకొని ధర్నాకు దిగారు. మాటలు వద్దు అని చేతలే ముద్దు అంటూ నినాదాలు చేస్తన్నారు. కానీ ప్రభుత్వం ప్రైవేటు డ్రైవర్లతో బస్సులను నడిపించడానికి ప్రయత్నిస్తోంది. పోలీసుల భద్రతాలో బస్సులు నడిపిస్తుండడగా ఆర్ టిసి కార్మికులు అడ్డుకుంటున్నారు.














