ఉప్పల్: తెలంగాణలో ఆర్ టిసి కార్మికుల సమ్మెతో ప్రజా రవాణా స్తంభించిపోయింది. ఎక్కడికక్కడే డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. సమ్మె ప్రభావంతో ప్రయాణికులు లేక ఉప్పల్ రింగ్ రోడ్డు వెలవెలబోతుంది. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద  వరంగల్ రూట్ లో బస్సులు లేకపోవడంతో నిర్మానుష్యంగా కనిపిస్తోంది. ప్రైవేట్ వెహికల్స్ డ్రైవర్లు ప్రయాణికుల వద్ద అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. బస్సులు లేక ప్రయాణికుల ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా కూడా బస్సుల సరిపోవడం లేదు. బస్సుల కోసం బస్టాండుల్లో ప్రయాణికుల పడిగాపులు కాస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో ఊళ్లకు జనం బయల్దేరారు. బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ సమ్మెను ప్రైవేట్ టాక్సీలు, ఆటోలు క్యాష్ చేసుకుంటున్నాయి.