నవతెలంగాణ – అచ్చంపేట :  మండల పరిధిలోని  సింగారం గ్రామంలో  రోడ్డు మలుపు లో నివాస గృహాలు ఉన్నాయి. ఆర్టీసీ బస్సు తిరగటానికి ఇబ్బందిగా ఉంది. దింతో గ్రామానికి చెందిన దుర్గి శ్రీనివాసులు, రవీంద్ర శర్మ (పురోహితులు) వాళ్ళ అమ్మ నాన్నలు స్వర్గీయ దుర్గిసత్యనారాయణ శర్మ, దుర్గిబాలక్రి ష్టమ్మగార్ల పేర్ల మీద  విలువైన సొంత  స్థలం గ్రామ ప్రజల సౌకర్యరార్థం కోసం విరాళంగా ఇచ్చారు. వారికీ  సింగారం గ్రామప్రజలు, సర్పంచ్  నీలం శేఖర్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.

The post గ్రామ ప్రజల సౌకర్యం కోసం సొంత స్థలం విరాళం appeared first on Navatelangana.