సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహే ష్ బాబు అన్న కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని... అజ య్ భూపతి దర్శకత్వంలో ’శ్రీనివాస మంగాపురం’ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానిని కూడా ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. నిర్మాత పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అశ్విని దత్ సమర్పిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి రావే చెలియా సాంగ్ ని లాంచ్ చేశారు. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ పాటను ప్రే మ, భావోద్వేగాలతో హార్ట్ టచ్చిం గ్ మెలోడీగా కంపోజ్ చేశారు. నాగ్ అర్జున్ రెడ్డి అందించిన మనసుని తాకే సాహిత్యానికి, కపిల్ కపిలన్ తన గాత్రంతో ప్రాణం పో శారు. ప్రేమ, ఎడబాటు, మనసులోని భావాలను ఈ పాట అద్భుతంగా పలికించింది. ఈ పాటలో జై కృష్ణ, రాషా తడానీ మధ్య ప్రేమ దూరమైనప్పుడు కలిగిన భావోద్వేగాలు ప్రేక్షకులను హత్తుకున్నాయి. ఈ చిత్రం జూలై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.