
ఇరాన్ క్షిపణి డ్రోన్ల దాడుల్లో గాయపడ్డ ముగ్గురు భారతీయులు
దుబాయ్ ః అరబ్ ఏమిరేట్స్పై సోమవారం ఇరాన్ క్షిపణుల దాడికి దిగింది. యుఎఇలోని ఫుజెయిరాలో జరిగిన ఈ సైనిక చర్యలో ముగ్గురు భారతీయ పౌరులు గాయపడ్డారు. కొద్దిరోజుల విరామం తరువాత ఇరాన్ ఈ గల్ఫ్దేశంపై అందులోనూ కీలకమైన చమురు క్షేత్ర ప్రాంతంపై విరుచుకుపడింది. ఈ పరిణామం తిరిగి కలకలానికి దారితీసింది. సోమవారం రాత్రి చాలా పొద్దు పోయిన తరువాత జరిగిన ఈ మిస్సైల్స్ , డ్రోన్ల దాడి ఘటన వివరాలు తెలియలేదు. దాడి జరిగిన ప్రాంతంలోని ఎమిరేట్స్ లోని చమురు స్థావరానికి నష్టం వాటిల్లిందీ లేనిది తెలియలేదు.











