
దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బి.టెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జెఇఇ అడ్వాన్స్డ్ -2026 పరీక్ష ప్రాథమిక కీ ని ఐఐటీ రూర్కీ విడుదల చేసింది. కీపై అభ్యంతరాలుంటే మంగళవారం(మే 26) సాయంత్రం 5 గంటల వరకు అధికారిక వెబ్సైట్లో తెలపవచ్చని తెలిపారు. ఈమెయిల్ లేదా ఏ ఇతర మార్గాల ద్వారా వచ్చే అభిప్రాయాలు స్వీకరించమని స్పష్టం చేసింది. ఈనెల 17న దేశవ్యాప్తంగా రెండు షిఫ్టుల్లో జెఇఇ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్టు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో షిఫ్టులో ఈ పరీక్షలు జరిగాయి. పేపర్-1, పేపర్-2 ప్రశ్నపత్రం పరీక్ష జరిగిన రోజు వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. షెడ్యూల్ ప్రకారం జూన్ 1న తుది కీ, ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది.










