మెట్‌పల్లి: జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో బస్సు ప్రమాదం జరిగింది. ఆర్‌టిసి ఎలక్ట్రిక్ బస్సు మెట్‌పల్లి శివారులోకి రాగానే అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 12 మంది ప్రయాణికులు ఉన్నారు. స్వల్పంగా గాయపడిన 12 మందిని ఆస్పత్రికి తరలించారు. బస్సు నిజామాబాద్ నుంచి వరంగల్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జుగా మారింది.