జపాన్‌లో సంభవించిన భారీ భూకంపం కారణంగా ఇప్పటివరకు కనీసం 13 మంది మృతి చెందినట్లు ఆ దేశ ప్రధాని సనాయ్ తకాయిచి ధృవీకరించారు. జపాన్ దక్షిణ ప్రధాన ద్వీపమైన క్యుషూలోని కుమమోటో ప్రిఫెక్చర్‌లో మంగళవారం 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం సముద్ర మట్టానికి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు జపాన్ వాతావరణ సంస్థ (జేఎంఏ) వెల్లడించింది. భూకంపం ధాటికి వందలాది భవనాలు కూలిపోగా, రహదారులు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో 350 మందికి పైగా గాయపడ్డారు. కుమామోటోలోని ఒక పెద్ద షాపింగ్ మాల్‌ లో గ్యాస్ లీకేజీ కారణంగా భారీ పేలుడు సంభవించి భవనం ఒక భాగం కూలిపోయింది. అలాగే యాట్సుషిరో నగరంలోని ఒక పేపర్ ఫ్యాక్టరీలో భారీ చిమ్నీ నేలమట్టమైంది. శిథిలాల కింద చిక్కుకున్న మరికొందరి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. భూకంపం తర్వాత దాదాపు 2.60 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించారు