హైదరాబాద్: ప్రజలు సంతోషంగా ఉండాలనే ఆలోచన బిఆర్ఎస్ కు లేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందా అనేదే బిఆర్ఎస్ ఆలోచనని అన్నారు. ఈ సందర్భంగా సిఎల్పి కార్యాలయం లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులకు ఇప్పటి వరకు ఒక్క పగులు కూడా రాలేదని తెలియజేశారు. కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టులకు ఎప్పుడైనా సమస్యలు వచ్చాయా? అని అడ్లూరి లక్ష్మణ్ ప్రశ్నించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు తుమ్మడిహట్టి వద్ద రూ. 15 వేల కోట్ల పనులు పూర్తయ్యాయని, జైపూర్ చెరువు నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి నేరుగా నీళ్లు వదలొచ్చునని అడ్లూరి లక్ష్మణ్ సూచించారు. లిఫ్ట్ పెట్టి నీళ్లు వదిలితే మిషన్లు కొనొచ్చునని, కమీషన్లు తీసుకోవచ్చుననేదే బిఆర్ఎస్ ఆలోచనని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చ పెడితే బిఆర్ఎస్ నాయకులు ఎందుకు సమాధానం చెప్పలేదు? అడ్లూరి లక్ష్మణ్ అని ప్రశ్నించారు.