
అమరావతి: సెప్టెంబర్ 1న రాష్ట్రవ్యాప్తంగా 61,92,396 మందికి పింఛన్ల పంపిణీ జరుగుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సెప్టెంబర్ ఎన్టిఆర్ భరోసా పింఛన్లకు రూ.2,693.90 కోట్లు విడుదల చేయనున్నారని అన్నారు. ఈ సందర్భంగా కొండపల్లి మీడియాతో మాట్లాడుతూ..కొత్తగా 6,268 మందికి స్పౌజ్ పింఛన్లు, రూ.2.51 కోట్లు విడుదల జరుగుతుందని, భర్తను కోల్పోయిన అర్హులైన జీవిత భాగస్వాములకు సామాజిక భద్రతే లక్ష్యమని తెలియజేశారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందిస్తామని కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.











