ఢిల్లీ: అత్యాచారం, హత్య కేసులో ఉరిశిక్ష పడి పదమూడు ఏళ్లు జైలు జీవితం గడిపిన వ్యక్తి నిర్దోషి అని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. సదరు నిందితుడికి లైంగిక సామర్థ్యంలేదని, కింద కోర్టులు ఎలా శిక్ష వేస్తాయని చురకలంటించింది. సరైన ఆధారాలు లేకపోవడంతో ప్రాసిక్యూషన్ కథనంలో లోపాలు ఉండడంతో నిందితుడితో పాటు స్నేహితుడికి సుప్రీంకోర్టు విముక్తి కల్పించింది. నిందితులకు ఉరిశిక్ష వేసిన కిందికోర్టు, హైకోర్టు ఉత్తర్వులను కొట్టేసింది. బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డారని, ఆమె ప్రతి ఘటించడంతో నిందితుల చంపేశారని ప్రాషిక్యూషన్ కోర్టుకు తెలిపింది. ఈ వాదనను సుప్రీంకోర్టు నిరాకరించింది, నిందితుడు మెహతాబ్ ను డాక్టర్ బిఎస్ అస్వాల్ పరీక్షించారు. శారీరక లోపం ఉండడంతో అతడు లైంగిక చర్యలో పాల్గొనడం లేడని తెలిపింది.