
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా ఉగ్గినపాలెం వద్ద రోడ్డు ప్రమాదంలో జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మునగపాక మండలం అరబుపాలెం, మూలపేట గ్రామానికి చెందిన బంధువుల కారులో భద్రాచలం వెళ్లారు. తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు జ్యోతి(31), కూర్మారావు(42)గా గుర్తించారు. రెండు గ్రామాలలో విషాదచాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.












