నవతెలంగాణ – హైదరాబాద్ : లోక్‌సభ, రాజ్యసభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. జంతర్‌మంతర్‌ వద్ద నిరసనలో విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. అయితే ప్రభుత్వం దీనిపై చర్చించేందుకు సిద్ధంగా ఉందని, ప్రశ్నోత్తరాల తర్వాత అన్ని అంశాలపై చర్చిద్దామని స్పీకర్‌ తెలిపారు. సభ సజావుగా సాగేందుకు సభ్యులంతా సహకరించాలని కోరారు. అయినా విపక్షాలు నినదాలు ఆపకపోవడంతో అటు లోక్‌సభను, ఇటు రాజ్యసభను స్పీకర్లు మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు.

The post లోక్‌సభ, రాజ్యసభ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా appeared first on Navatelangana.