
గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ జోరు కొనసాగుతోంది. వెయిట్ లిఫ్టింగ్లో స్టార్ ఆటగాడు లవ్ప్రీత్ సింగ్ రజతం సొంతం చేసుకున్నాడు. మహిళల డిస్కస్ త్రో విభాగంలో సీమా కళిరామన్ కాంస్యం దక్కించుకుంది. మహిళల బాక్సింగ్లో జస్మయిన్ లంబోరియా, అరుంధతి చౌదరి ఫైనల్కు చేరి రజతాలు ఖాయం చేసుకున్నారు. పురుషుల 110 ప్లస్ కిలోల వెయిట్లిఫ్టింగ్ విభాగంలో భారత ఆటగాడు లవ్ప్రీత్ సింగ్ రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకున్నాడు. ఓవరాల్గా 388 కిలోల బరువును ఎత్తిన లవ్ప్రీత్ తృటిలో స్వర్ణం సాధించే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. న్యూజిలాండ్ వెయిట్లిఫ్టర్ డేవిడ్ ఆండ్రూ 389 కిలోల బరువును ఎత్తి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. లవ్ప్రీత్ కేవలం ఒక కిలో బరువు తక్కువగా ఎత్తడంతో స్వర్ణం చేజారింది. 38 ఏళ్ల లవ్ప్రీత్ అసాధారణ ఆటతో అలరించాడు. స్నాచ్లో 176 కిలోల బరువును ఎత్తాడు. ఇక క్లీన్ అండ్ జర్క్లో 212 కేజీల బరువును మోసాడు. ఇంగ్లండ్ వెయిట్లిఫ్టర్ గ్రిఫిత్ కాంస్యం దక్కించుకున్నాడు.










