
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరికొత్త చిత్రం ‘కొరియన్ కనకరాజు’తో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రానున్న ఈ హారర్-కామెడీ సినిమాని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్, ఫస్ట్ సింగిల్ బ్లాక్ బస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తు తం ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్ ‘రాసా గుమ్మాడి’ వచ్చేసింది. ఈ పాట ను ఆదివారం నాడు అనంతపురంలో అభిమానుల సమక్షంలో విడుదల చేశారు. తమన్ స్వరపరిచిన ఈ ఎనర్జిటిక్ ఫోక్ సాంగ్ అదిరిపోయింది.ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో..మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. “కొరియన్ కనకరాజు’ చిత్రీకరణ అనంతపూర్లోనే జరిగింది. అందుకే ఈ పాటను ఇక్కడే రిలీజ్ చేయాలని అనుకున్నాం. అభిమానుల సమక్షంలో ఇలా పాటను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నా రు. మేర్లపాక గాంధీ మాట్లాడుతూ.. “కొరియన్ కనకరాజు’లో మాస్కి నచ్చే ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. అనంతపూర్ బ్యాక్ గ్రౌండ్లోనే సినిమా ఉంటుంది’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రాజీవ్ రెడ్డి పాల్గొన్నారు.











