అమరావతి: ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని వైసిపి నేతలు కలుషితం చేయాలని చూస్తున్నారని టిటిడి బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డిది ఉదార్పు యాత్ర కాదు.. అరాచక యాత్ర చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2019 నుంచి 2024 వరకు అరాచకం రాజ్యమేలిందని విమర్శించారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర చేయాలని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్, మాధవ్ మంచి ఆలోచనలతో ముందుకెళ్తున్నారని భానుప్రకాశ్ రెడ్డి తెలియజేశారు. సీదిరి కుమారుడిని తప్పించడానికి వేరేవారిని బలిచేస్తారా? అని ప్రమాదం తమరు చేసి.. ప్రభుత్వంపై నెట్టాలని చూస్తారా? అని భానుప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. వైసిపి ప్రభుత్వంలో గొడ్డలి పోటును గుండెపోటుగా మార్చారని, తప్పు చేసిన వారిని వదిలిపెట్టేది లేదని, కఠిన శిక్షలు ఉంటాయని సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సమయంలో అలజడులు సృష్టించాలని చూస్తున్నారని, రౌడీరాజకీయాలు చేస్తే ఉక్కుపాదంతో అణిచివేస్తామని భానుప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు.