
మహబూబ్ నగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక కలెక్టరేట్ సమీపంలో పెళ్లి బృందంతో వెళ్తున్న వాహనం బొల్తా పడడంతో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా క్రేన్ సహాయంతో వాహనాన్ని పక్కకు తొలగించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.













