న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: తమిళనాడు ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK)కు ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. మదురాంతకం ఎమ్మెల్యే మరకతం కుమారవేల్, ధారపురం ఎమ్మెల్యే సత్యభామ, పెరుందరై ఎమ్మెల్యే జయకుమార్ ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ జెసిడి. ప్రభాకరన్‌కు తమ రాజీనామా లేఖలు అంద‌జేశారు. తాజాగా స‌దురు ఎమ్మెల్యేల రాజీనామాల‌ను ఆమోదించారు. అసెంబ్లీ రూల్స్ ప్ర‌కారం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆయ‌న మీడియాకు వెల్ల‌డించారు.

The post ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా..తమిళనాడు అసెంబ్లీ స్పీక‌ర్ ఆమోదం appeared first on Navatelangana.