
ఐపిఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్ కు దూసుకెళ్లింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టుపై రాజస్థాన్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో బెంగళూరు, గుజరాత్, హైదరాబాద్ జట్లతో పాటు ప్లేఆఫ్ రేసులోకి రాజస్థాన్ అడుగుపెట్టింది. ఈ క్రమంలో పంజాబ్, కోల్ కతా జట్ల ప్లేఆఫ్ ఆశలు గల్లంతయ్యాయి. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 175 పరుగులకే పరిమితమైంది.












