
అమరావతి: నెల్లూరు జిల్లా సూరాయిపాలెం మద్యం దుకాణం వద్ద ఓ వ్యక్తి బీభత్సం సృషించాడు. మద్యం దుకాణానికి పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నం చేశాడు. పొదలకూరు మండలం సూరాయిపాలెం మద్యం దుకాణం వద్ద రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిగరెట్ కాల్చుకునేందుకు అగ్గిపెట్టె ఇవ్వలేదని ఆగ్రహం చెంది మద్యం దుకాణానికి పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు సిద్ధపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిసిబ్బంది మంటలు ఆర్పేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.











