
హైదరాబాద్: నల్లగొండలో ఆర్ టిసి డ్రైవర్ పై దాడిని మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు. టిజి 05 యు 3219 ఆర్టీసీ బస్సు ను డ్రైవర్ టి.రామ్ కుమార్ నల్గొండ - దిల్ సుఖ్ నగర్ మధ్య నడిపిస్తున్నాడు. నల్గొండ నుండి వివిధ స్టాప్ ల వద్ద ఆగుతూ ప్రయాణికులను తీసుకొని వస్తున్న బస్సు వెనకాల బైక్ పై వస్తున్న వ్యక్తి తన భార్యను తీసుకొని వస్తు నల్గొండ ఐటి టవర్ వద్దకు రాగానే బస్సు ఎక్కించే ఉద్దేశ్యంతో బస్సును ఓవర్ టెక్ చేసి అడ్డగించాడు. అనంతరం డ్రైవర్ రామ్ కుమార్ పై దాడి చేశాడన్నారు. విధుల్లో ఉన్న ఆర్టీసి సిబ్బంది పై దాడి చేస్తే ఉపేక్షించేది లేదని పొన్నం హెచ్చరించారు. డ్రైవర్ రామ్ కుమార్ పై దాడి చేసిన వ్యక్తి పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని తెలియజేశారు. భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి అని ఆదేశించడం జరిగిందన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఎల్లవేళలా అండగా ఉంటామని పొన్నం పేర్కొన్నారు.













