
న్యూయార్క్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి దుర్మరణం చెందారు. న్యూజెర్సీలో సిగ్నల్ వద్ద కారును మరో కారు ఢీకొట్టడంతో ఓ మహిళా చనిపోయింది. మృతురాలు రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం ఆకుతోటపలోలి గ్రామానికి చెందిన శ్రీపాతి దీపారెడ్డిగా గుర్తించారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.... మాడుగుల మండల కేంద్రానికి చెందిన పట్టాభి శేఖర్ రెడ్డి, శశిరేఖ దంపతులకు దీపారెడ్డి కూతురు. 20 సంవత్సరాల క్రితం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డితో దాపారెడ్డి పెళ్లి జరిగింది. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కావడంతో అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. న్యూజెర్సీలో దీపారెడ్డి కారులో ప్రయాణిస్తుండగా ఆమె కారును మరో కారు ఢీకొట్టడంతో ఆమె ఘటనా స్థలంలోనే మరణించింది.











