ఢిల్లీ: పార్లమెంట్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. పార్లమెంటు వద్ద కాక్రోచ్ జనతాపార్టీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. పార్లమెంటు స్ట్రీట్ కు వేలాదిగా సిజెపి కార్యకర్తలు తరలివచ్చారు. బారీకేడ్లు తోసుకుని వచ్చిన కార్యకర్తపై పోలీసుల లాఠీఛార్జీ చేశారు. తోపులాటలో పలువురు పోలీసులు, సిజెఐ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఆందోళనకు దిగిన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్లమెంటు వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించారు. పార్లమెంటు గేట్లు పోలీసు భద్రతా బలగాలు మూసి వేశారు. పార్లమెంటు సమీపంలోని పటేల్ చౌక్, అన్ని మార్గాల్లో సిజెపి కార్తలు భైఠాయించారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. లాఠీఛార్జ్ ఖండిస్తూ పెద్దఎత్తున సిజెపి కార్యకర్తలు నినాదాలు చేశారు.