
ఢిల్లీ: నెల రోజులుగా భారత్ అనేక కార్యక్రమాలు విజయవంతంగా చేపడుతోందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. రాష్ట్రీయ, జాతీయ, అంతరిక్ష రంగాల్లో భారత్ గర్వించదగిన క్షణాలు అని అన్నారు. ఈ సందర్భంగా మోడీ మీడియాతో మాట్లాడుతూ.. కాసేపట్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయని, నెల రోజులుగా అనేక పరిణామాలు జరిగాయని తెలియజేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేలా చూడాలని, రెండ్రోజుల క్రితం ప్రయోగం ద్వారా ప్రపంచంలోని కొన్ని దేశాల సరసన నిలిచామని అన్నారు. భారత యువత అంతరిక్షంలో తమదైన ముద్ర వేశారని మోడీ కొనియాడారు. ఈ వర్షాకాల సమావేశాలు అత్యంత ఫలప్రదంగా సాగాలని అందరం ప్రార్థిద్దామని, గతేడాది ఇదే సమాయానికి అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కు చేరుకున్నామని, ప్రైవేటు సంస్థ అభివృద్ధి చేసిన రాకెట్ ను రోదసీలో విజయవంతంగా ప్రవేశపెట్టారని మోడీ పేర్కొన్నారు.











