కర్ణాటక: రాజీనామా చేయాలనుకునేవారిని ఎవరూ ఆపలేరని కర్ణాటక సిఎం డికె శివకుమార్ తెలిపారు. రాజీనామాలు రాజకీయాల్లో సహజమేనని అన్నారు. ఎమ్ఎల్ఎల రాజీనామాలపై డికె శివకుమార్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ఉంటేనే రాజకీయ భవిష్యత్ ఉంటుందని తెలియజేశారు. థరమ్ సింగ్, సిద్దరామయ్య హయాంలో తనకు పదవి రాలేదని అన్నారు. పార్టీ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని, అసంతప్తి పేరుతో ఒత్తిడి రాజకీయాలు చేయొద్దని డికె శివకుమార్ కోరారు.