హైదరాబాద్: దేశంలోనే ఎంతో ఆదరణ పొందిన నాయకుడు దివంగత కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రజా సమస్యలపై స్పష్టమైన అవగాహనతో, పదునైన ప్రసంగాలతో గళమెత్తిన మేధావి అత్యుత్తమ పార్లమెంటేరియన్ అని గుర్తు చేశారు. జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పొన్నం మీడియాతో మాట్లాడారు. 15 వ లోక్ సభ లో తో పార్లమెంట్ సభ్యుడిగా తాము కొత్తగా పార్లమెంట్ లో అడుగుపెట్టినపుడు ఆయన మాకు ఎంతో స్ఫూర్తి కలిగించారని ప్రశంసించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ప్రక్రియలో, పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంలో జైపాల్ రెడ్డి ఎంతో కృషి చేశారని కొనియాడారు. జైపాల్ రెడ్డి తమ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎల్లప్పుడూ సిద్ధాంతాలు, నైతిక విలువలు, మచ్చలేని నిబద్ధతతో పనిచేశారని, ఆయన రాజకీయ ప్రస్థానం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు.