అమరావతి: అనంతపురం జిల్లా డి.హీరేహాల్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఓ యువకుడు ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు. తిప్పేరుద్ర (35) అనే వ్యక్తి పెళ్లికాలేదని మనస్థాపానికి చెంది వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.