నవతెలంగాణ – హైదరాబాద్ : బంగారం, వెండి ధరలు మంగళవారం మళ్లీ పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.700 పెరిగి రూ.1,32,200కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.760 పెరిగి రూ.1,44,220 పలుకుతోంది. వెండి ధర భారీగా పెరిగింది. కేజీ వెండిపై ఏకంగా రూ.5,000 పెరగడంతో రూ.2,40,000 వద్ద ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.

The post పెరిగిన బంగారం, వెండి ధరలు appeared first on Navatelangana.