చిన్న సినిమాగా విడుదలై.. గొప్ప విజయాన్ని అందుకుంది ‘హనుమాన్ అంశ్’ చిత్రం. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు విశాల్ చతుర్వేది దీన్ని తెరకెక్కించారు. ఇప్పటికే రూ.100+ కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది ఈ చిత్రం. తాజాగా ఈ చిత్రాన్ని చూసేందుకు గురుకుల విద్యార్థులు ఢిల్లీలోని పివిఆర్‌కు వచ్చారు. సంప్రదాయ వస్త్రధారణలో వారు థియేటర్‌కి రావడం అందరిని ఆకట్టుకుంది. అక్కడ ఉన్న వారు ఈ దృశ్యాన్ని రికార్డు చేసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది