
హరారే: మూడు టి-20ల సిరీస్లో భాగంగా హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న తొలి టి-20 జింబాబ్వే భారత బౌలర్లను ఎదురుకుంటూ గౌరవప్రద స్కోర్ను సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ ప్రత్యర్థిని బ్యాటింగ్కి ఆహ్వానించింది. అయితే ఇన్నింగ్స్ తొలి బంతికే జింబాబ్వే వికెట్ కోల్పోయింది. ఒక దశలో 64 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో తడివానషే మరుమాని (27 నాటౌట్), వెస్లీ మధెవెరే(39)లు కలిసి పోరాడారు. వీరిద్దరు కలిసి 57 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశారు. దీంతో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. భారత బౌలింగ్లో మయాంక్, ప్రిన్స్లు చెరి రెండు వికెట్లు.. శివమ్ దూబె, రవి బిష్ణోయ్లు తలో వికెట్ తీశారు.











