కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకలతో పాటు ఇతర నాయకులను అదుపులోకి తీసుకోవడాన్ని సిఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఇది ప్రజాస్వామ్య హక్కుపై జరిగిన దాడి అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నుండి జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తున్న యువతకు కాంగ్రెస్ కుటుంబం, దేశం మొత్తం అండగా నిలుసా ్తయన్నారు. ‘మీరు మమ్మ ల్ని జైలులో పెట్టవచ్చు, మమ్మల్ని అణచివేయడానికి ప్రయత్నించవచ్చు; కానీ న్యాయం, జవాబుదారీతనం కోసం పోరాడుతున్న లక్షలాది మంది భారతీయ యువత ఆగ్రహాన్ని మాత్రం మీరు అణచివేయలేర’ని అన్నారు.