గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లా గరాజియా గ్రామంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. పొదల్లో దాక్కున్న సింహం అకస్మాత్తుగా ఓ పశువుల కాపరిపై దూకి దాడి చేసింది. అయితే స్థానికులు వెంటనే అప్రమత్తమై పెద్దగా కేకలు వేయడంతో సింహం అక్కడి నుంచి అడవిలోకి పారిపోయింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని చికిత్స నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.