
మన తెలంగాణ/హైదరాబాద్ : ఒత్తిడి పరిస్థితులలో కణాలను రక్షించడం, కండరాల పనితీరును కాపాడటం, దీర్ఘాయువును పెంచడంలో పతంజలి వారి ప్రత్యేక చ్యవన్ప్రశ్కు విశేష గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పత్రిక ‘ఎక్స్పెరిమెంటల్ జెరోంటాలజీ’లో సంబంధిత అధ్యయనం ప్రచురితమైంది. ఈ క్రమంలో పతంజలి శాస్త్రవేత్తలు కీలక శాస్త్రీయ మైలురాయిని సాధించినట్లయింది. శాస్త్రీయ సమాజంలో ఆయుర్వేదాన్ని ఒక ఆధార-ఆధారిత వైద్య విధానంగా స్థాపించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేసింది.
ఈ సందర్భంగా ఆచార్య బాలకృష్ణ మాట్లాడుతూ పతంజలి శాస్త్రవేత్తలు ఈ శాశ్వతమైన సాంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక శాస్త్రీయ ఆలోచనలు మరియు వివేకంతో బలపరిచి, పరిశోధన మరియు సాంకేతికత ద్వారా ఈ ప్రాచీన కథనానికి తిరిగి జీవం పోశారని ప్రశసించారు. అధ్యయనం గురించి పతంజలి రీసెర్చ్ ఫౌండేషన్ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ అనురాగ్ మాట్లాడుతూ పరిశోధనను ఆయుర్వేదం మరియు సమకాలీన శాస్త్రాల అద్భుతమైన సమ్మేళనంగా అభివర్ణించారు.











