మంగళవారం నుంచి రెండు రోజులపాటు కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఎడ్యుకేషన్ హబ్ పనులను సిఎం రేవంత్‌రెడ్డి పరిశీలించనున్నారు. నియోజకవర్గ అభివృద్ధి పనులు, ఎస్‌ఐఆర్‌పై సిఎం రేవంత్‌రెడ్డి అధికారులతో సమీక్షించనున్నారు. నేడు సాయంత్రం 4 గంటలకు దుద్యాల్ మండలం, హకీంపేట గ్రామంలోని ఎడ్యుకేషన్ హబ్‌ను సిఎం రేవంత్‌రెడ్డి పరిశీలిస్తారు. సాయంత్రం 5 గంటలకు కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని అభివృద్ధి పనులపై అధికారులతో సిఎం సమీక్షిస్తారు. నేడు రాత్రి కొడంగల్‌లోనే ముఖ్యమంత్రి బస చేయనున్నారు. 22వ తేదీన ఉదయం 10 గంటలకు స్థానిక నాయకులు, బిఎల్‌ఓలతో ఎస్‌ఐఆర్‌పై సిఎం రేవంత్‌రెడ్డి సమీక్షిస్తారు. అనంతరం తిరిగి హైదరాబాద్‌కు సిఎం రేవంత్‌రెడ్డి చేరుకుంటారు.