
ఢిల్లీ: కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవట్లేదని కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ ఆరోపించారు. నిరసనకారులపై కేసులు ఉపసంహరించుకుంటామని చెప్పారని అన్నారు. సౌరవ్ దాస్ కీలక ప్రకటనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వివిధ రాష్ట్రాల్లో నిరసకారులపై కేసులు పెడుతున్నారని, కేసులు పెట్టినట్లు పలు రాష్ట్రాల నుంచి తమకు సమాచారం వస్తోందని, కేసుల గురించి సిజెపి లాయర్లను సంప్రదిస్తుందని సూచించారు. ప్రత్యేకించి అసోం, బెంగాల్, బిహార్ లో ఎక్కువ కేసులు పెట్టారని, ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని మంత్రులకు గుర్తుచేస్తున్నామని అన్నారు. రేపటిలోగా దేశవ్యాప్తంగా అన్ని కేసులు ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలపై నమ్మకంతో ఆందోళన విరమించామని తెలిపారు. కేసులపై మాటతప్పడం నమ్మకం ద్రోహమని, కేసులు పెటడం లక్షలాది విద్యార్థులను వంచించడమేనని మండిపడ్డారు. కేంద్రం చేసిన నమ్మకద్రోహాన్ని యువత అంగీకరించదని సౌరవ్ దాస్ హెచ్చరించారు.











