
రాష్ట్రంలో బుధవారం ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్ల సమ్మె జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న ఈ సమ్మెలో అందరూ పాల్గొనాలని పిలుపు నిచ్చారు. కార్మిక హక్కులు, సామాజిక భద్రత కోసం పోరాటం చేస్తున్నట్లు వారు ప్రకటించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆగస్టు 8వ తేదీ నుంచి నిరవధిక సమ్మె కు దిగుతామని రేపు ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్ల అసోసియేషన్ హెచ్చరించింది. వీరికి మద్దతుగా స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో కూడా సమ్మె బాట పట్టే అవకాశం ఉందని సమాచారం.











