లార్డ్స్: మూడో వన్డేలో ఇంగ్లాండ్ గెలిచి సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. భారత్‌పై ఇంగ్లాండ్ 27 పరుగుల తేడాతో మూడో వన్డేలో విజయం సాధించింది. రోహిత్ శర్మ భారీ సెంచరీ చేసినప్పటి చేయాల్సిన పరుగులు ఎక్కువగా ఉండడంతో భారత జట్టు ఓటమిని చవిచూసింది. ఇంగ్లాండ్ జట్టు తొలుత బ్యాటింగ్ 388 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. రోహిత్ శర్మ 110 బంతుల్లో 138, శుభ్‌మన్ గిల్ 84 బంతుల్లో 77 పరుగులు, విరాట్ కోహ్లీ 60 బంతుల్లో 74 పరుగులు చేశారు. మిగిలిన బ్యాట్స్‌మెన్లు ఒత్తిడికి గురికావడంతో భారత జట్టు ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో శ్యామ్ కరన్ నాలుగు వికెట్లు, జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్, జాకోబ్ బెతెల్ తలో ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ వికెట్ తీసి 91 పరుగులు చేసిన జాకబ్ బెతెల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. 249 పరుగులు చేసిన జోయ్ రూట్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ సొంతం చేసుకున్నాడు.