నారాయణపూర్: ఛత్తీస్‌గఢ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. నారాయణపూర్ జిల్లా ఆబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలోని బాలేవాడ సిఆర్‌పిఎఫ్ క్యాంపును వరద నీరు ముంచెత్తింది. ఒక్కసారిగా వరదపొటెత్తడంతో జవాన్లు చెట్లు, రేకుల షెడ్ల పైకెక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. క్యాంపు మొత్తం వరద నీటిలో మునిగిపోయింది. అధికారులు వెంటనే స్పందించి జవాన్లను సురక్షిత ప్రాంతానికి తరలించారు.