
యానాం: చట్టం అందరికీ సమానమే. ఎవరికి చుట్టం కాదు అనే ఈ వార్త ద్వారా తెలుస్తుంది. పుదుచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్ ఎంఎల్ఎ వయ్యాపురి మణికందన శనివారం తన బైక్పై అసెంబ్లీకి వెళ్లారు. హెల్మెట్ లేకపోవడంతో నంబరు ప్లేటు లేని బైక్ను డ్రైవ్ చేసుకుంటూ అసెంబ్లీకి వెళ్లడంతో పోలీసులు సదరు ఎంఎల్ఎకు రూ.1500 జరిమానా విధించారు. సిఎం కార్యాలయం అధికారులు ఎంఎల్ఎలకు మూడు నెలల క్రితం కార్లు ఇచ్చారు కానీ డ్రైవర్లను ఏర్పాటు చేయకపోవడంతో తాను బైక్పై అసెంబ్లీకి వచ్చానని మణికందన్ తన బాధను వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని నెటిజన్లు ప్రశంసించారు.








