విద్యుత్ ఏఈ నరేందర్ గౌడ్నవతెలంగాణ-మిడ్జిల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో విద్యుత్ వినియోగదారులకు సోలార్ విద్యుత్ పై గురువారం విద్యుత్ అధికారుల సమక్షంలో రెడ్కో సంస్థ వారు విద్యుత్ వినియోగదారులకు, రైతులకు సోలార్ సిస్టం గురించి డెమో ద్వారా అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు మిడ్జిల్ విద్యుత్ ఏఈ నరేందర్ గౌడ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల రైతులు, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సోలార్ ద్వారా విద్యుత్ లాభాల గురించి అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
The post సోలార్ విద్యుత్ పై రైతులకు అవగాహన appeared first on Navatelangana.














