సూరారంలో ఆరు నెలల బాలిక కిడ్నాప్

కుత్బుల్లాపూర్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా  కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలోని సూరారం లీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలిక కిడ్నాప్ కు గురైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..... సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రి ఎదురుగా ఉన్న మార్బల్ షాప్ ముందు కుటుంబం నివసిస్తోంది. తల్లిదండ్రులతో నిద్రిస్తున్న ఆరు నెలల చిన్నారిని ఇద్దరు దుండగులు బైక్ పై ఎత్తుకెళ్లారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.