తిరుపతి: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భారీగా భక్తుల రద్దీ రోజు రోజుకూ పెరుగుతోంది. తిరుమలలలో టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 12 గంటలు పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 17 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం శ్రీవారిని 84,645 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.50 కోట్లు అని.. ఆదివారం శ్రీవారికి తలనీలాలు 29,700 మంది భక్తులు సమర్పించినట్లుగా టిటిడి అధికారులు వెల్లడించారు.