ఢిల్లీ: భారతదేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వం, స్వేచ్ఛ, ప్రజాస్వామిక విలువలకు ప్రతీకగా ప్రతి భారతీయుడిలో స్ఫూర్తిని నింపేది త్రివర్ణ పతాకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. జాతీయ జెండా ఆమోద దినోత్సవం రోజున దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి ప్రాణత్యాగాలు చేసిన సమరయోధులను స్మరించుకుందామని పిలుపునిచ్చారు. మన త్రివర్ణ పతాకం వారి త్యాగాలకు, దేశభక్తికి చిరస్మరణీయ ప్రతీక అని ప్రశంసించారు. జాతీయ జెండాను గౌరవించడం ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత అని, న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే రాజ్యాంగ విలువలను ప్రతిరోజూ ఆచరిస్తూనే ఉండాలని, మన జాతీయ పతాకానికి నిజమైన గౌరవాన్ని అందిద్దాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు.