
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురంలో గిరిజన విద్యార్థినులు, మహిళలు చారిత్రాత్మక ఘనత సాధించారు. 13 వేల మంది గిరిజన బాలికలు, మహిళలు ఒకేసారి సాంప్రదాయ 'ధింసా' నృత్యం చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. అతిపెద్ద ధింసా నృత్య ప్రదర్శన విభాగంలో ఇది అధికారికంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకుంది. భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంగణంలో ఈ అద్భుత ప్రదర్శన జరిగింది. పిఎం మోడీ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న తరుణంలో ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ భారీ కార్యక్రమాన్ని తలపెట్టింది. గిరిజన సంక్షేమ పాఠశాలలకు చెందిన 8, 9, 10 తరగతుల విద్యార్థినులు, గిరిజన మహిళలు ఈ రికార్డులో భాగస్వాములయ్యారు.










