నవతెలంగాణ – హైదరాబాద్ : ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై మరోసారి దాడులు చేసేందుకు రష్యా సిద్ధమవుతోంది. కీవ్‌లోని రక్షణరంగ పరిశ్రమలు, కమాండ్‌ సెంటర్లు, డ్రోన్‌ తయారీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని దాడి చేసే అవకాశం ఉంది. ఈ మేరకు రష్యా కీలక ప్రకటన విడుదల చేసింది. విదేశీయులు కీవ్‌ను విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. మిలిటరీ, సాధారణ పరిపాలన భవనాలకు సాధారణ పౌరులు దూరంగా ఉండాలని హెచ్చరించింది.

The post విదేశీయులు కీవ్‌ను వీడి వెళ్లండి: రష్యా హెచ్చరిక appeared first on Navatelangana.