
కొండాపూర్: హైదరాబాద్ లోని కొండాపూర్ ప్రాంతంలో విద్యుత్ శాఖ ట్రాన్స్ కో డిఈ ఇంటిపై ఎసిబి దాడులు చేసింది. ఎసిబి డిఎస్ పి మాజీది అలీఖాన్ ఆధ్వర్యంలో ఇజ్జత్ నగర్ లోని హెటెక్స్ సమీపంలో ట్రాన్సకో డిఇ ముత్యం వెంకట రమణ ఇళ్లపై ఎసిబి అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. అక్రమ ఆస్తులు కలిగి ఉన్నాడని సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు హైటెక్స్ లోని మీనాక్షి స్కై లాంచ్ నివాసంతో పాటు 12 చోట్ల తనిఖీలు చేపట్టారు.











