
హైదరాబాద్: వికారాబాద్ జిల్లా పరిగి మండలం చింతల చెరువు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. 163వ నవంబర్ జాతీయ రహదారిపై లారీని వెనుక నుంచి కారు ఢీకొనడంతో కారు డ్రైవర్ మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. లారీని బలంగా ఢీకొట్టడంతో మంటలు ఎగసిపడి కారు దగ్ధమయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.













